: కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలో గడిచిన 24 గంటల్లో 46 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్లో 51 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలో 16 శాతం కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటిందని, ఇక మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఏపీల్లో లక్ష లోపే కేసులు ఉన్నాయన్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 80 లక్షల టీకా డోసులను ఇచ్చినట్లు భూషణ్ తెలిపారు.