కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. సుమారు 3570 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర ఉంటుంది. ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష, రాజకీయ వికేంద్రీకరణ లాంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఈ యాత్రలో అవగాహన కల్పించనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబదూర్లో మాజీ ప్రధాని రాజీవ్కు రాహుల్ నివాళి అర్పిస్తారు. ఇక ఆ తర్వాత కన్యాకుమారిలో జరిగే కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. దీంట్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగల్ కూడా పాల్గొంటారు. మిలే కదం, జుడే వతన్ ట్యాగ్లైన్తో యాత్రను నిర్వహిస్తున్నారు.