Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి : ప్రధాని మోదీ

స్వాతంత్రం సిద్ధించిన తర్వాత యూపీ అనేక ఎన్నికలను చూసిందని, అనేక ప్రభుత్వాలు వచ్చి పోవడాన్ని కూడా చూసిందని… కానీ ప్రస్తుత ఎన్నికలు మాత్రం అన్ని ఎన్నికల కంటే చాలా ప్రత్యేకమైనవని ప్రధాని మోదీ అభివర్ణించారు. గౌరవం, ఓ గుర్తింపు, శ్రేయస్సు వీటిని నిలబెట్టడానికి జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు యూపీలోని కొన్ని ప్రాంతాల ప్రజలతో వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.యూపీ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని వ్యవహరించాలని ప్రధాని హెచ్చరించారు. నకిలీ సమాజ్‌వాదీలు అధికారంలోకి వస్తే ప్రజలను ఆకలితో ఉంచుతారని, రైతులకు అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తారని చెప్పారు. తమ ప్రభుత్వమే రైతులకు అధికంగా మేలు చేసిందని చెప్పుకొచ్చారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కనీస మద్దతు ధర నేరుగా రైతుల అకౌంట్లలోకి చేరేట్లుగా ప్రణాళికలు వేసిందని అన్నారు. అయితే ఈ మధ్య ప్రతిపక్షాలు కనీస మద్దతు ధర విషయంలో లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img