Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

‘ఉజ్వల యోజన 2.0’ను ప్రారంభించిన ప్రధాని

ఉజ్వల 2.0 ఎల్పీజీ కనెక్షన్స్‌ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా నుంచి ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉజ్వల స్కీమ్‌ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా మరిన్ని కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. మొదటి విడతగా యూపీలోని పేద కుటుంబాలకు 1,47,43,862 ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహోబా నుంచి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img