దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న బెంగళూరులో ఇద్దరిలో ఈ కొత్త వేరియంట్ను గుర్తించారు. వారిలో తీవ్ర లక్షణాలు లేవని ఎవరూ ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది. విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరి చేసింది. తాజాగా విదేశాల నుంచి తమిళనాడు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. సింగపూర్ నుంచి తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రాయానికి, బ్రిటన్ నుంచి చెన్నైకి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడిరచారు.దీంతో వారిని ఆసుపత్రికి తరలించామని, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు చెన్నై, బెంగళూరుకు పంపించామని చెప్పారు.