Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

దేశంలో కొత్తగా 18,833 కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,833 కరోనా కేసులు నమోదయ్యాయి. 203 రోజుల తర్వాత కేసుల సంఖ్య భారీగా కేసుల సంఖ్య తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,38,71,881కి చేరింది. ఇందులో 3,31,75,656 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,49,538 మంది మృతిచెందారు. 2,46,687 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, 203 రోజుల తర్వాత ఇంత తక్కువకు చేరుకున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక గత 24 గంటల్లో కొత్తగా 24,770 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. మరో 278 మంది మృతిచెందారు. నిన్న దేశవ్యాప్తంగా 14,09,825 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడిరచింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 57,68,03,867 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img