దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58.82కోట్ల డోసులకుపైగా పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.నిన్నటికి టీకా డ్రైవ్ 220వ రోజుకు చేరింది. సోమవారం రాత్రి 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు 56,10,116 మోతాదులు అందజేసినట్లు తెలిపింది. నిన్న 39,62,091 మందికి మొదటి మోతాదును, 16,48,025 మంది రెండో మోతాదు ఇచ్చినట్లు తెలిపింది.టీకా డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి 58,82,21,623 డోసుల పంపిణీ జరిగింది.