Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకొచ్చిన రైలు.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్‌ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్‌లో ఓ గూడ్స్‌ రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 బోగీలు బోల్తా పడగా.. వాటి కింద పడి ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.. ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులంతా భయంతో పరుగులు తీశారు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు వేచి ఉండే గదికి సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో రైలు బోగీల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బోగీలను అక్కడి నుంచి తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో రైల్వేస్టేషన్‌లో ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కొంతభాగం కూలిపోయింది. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా అంతరాయం కలిగింది.ఈ ఘటనలో పది బోగీలు బోల్తా పడగా.. మూడు నాలుగు వ్యాగన్లు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జికి ఢీకొని ఆగిపోయాయి. రెస్క్యూ టీమ్‌ ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే.. ఒక గూడ్స్‌ రైలు స్టేషన్‌ దాటే సమయంలో వేగాన్ని తగ్గించాలి అంటున్నారు అధికారులు. ప్రమాదం జరిగినప్పుడు రైలు చాలా వేగంతో కదిలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img