కేంద్రమంత్రి నారాయణస్వామి
బల్లియా (యూపీ) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శలపై బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. హిందూ, హిందుత్వంపై రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఎ.నారాయణస్వామి స్పందిస్తూ.. రాహుల్ హిందువు కాదని, ఎన్నికలు దగ్గర పడినప్పుడల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని మండిపడ్డారు. ఇటీవల కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ హిందూ`హిందుత్వ మధ్య వ్యత్యాసాన్ని ప్రముఖంగా ప్రస్తావించడానికి ప్రయత్నిస్తున్నారు. హిందువుని సహనశీలిగా, హిందుత్వాన్ని అధికారాన్ని కోరుకునేదిగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఫెఫ్నా ప్రాంతంలో నిర్వహించిన సామాజిక సాధికారత శిబిరంలో పాల్గొన్న మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా అతను (రాహుల్ గాంధీ) ఇలానే మాట్లాడతాడు, కానీ అతను హిందువు కాదు’ అన్నారు.