Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మర్రిపాడు విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

మర్రిపాడు మండలం సింగనపల్లి మెయిన్ మరియు ఏపిల గుంట మెయిన్ ప్రాథమిక పాఠశాలల లోని విద్యార్థులకు కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లికి చెందిన కీ.శే పసుపులేటి వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు గడ్డం వెంకటరమణ దాతృత్వంతో ఉపాధ్యాయులు జీ.శ్రీనివాసులు సహకారంతో నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఎన్ పేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు భార్గవి,సింగనపల్లి సర్పంచ్ రాసాల గీత,ప్రధానోపాధ్యాయులు రవీంధ్ర రెడ్డి,సుబ్బారావు,సహోపాధ్యాయురాలు వీరభద్ర కుమారి,సింగనపల్లి ఎస్సీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓబయ్య,పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు మాధవి,మౌనిక,వైస్ చైర్మన్ సుధాకర్,అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img