Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

తెల్లరాయి తొవ్వుతున్న అక్రమార్కులు

రెవెన్యూ పోలీస్అధికారులకు ఫిర్యాదు

అనుమసముద్రంపేట : లక్షలాది రూపాయల విలువైన తెల్లరాయి (తెల్ల బంగారం) ను కొందరు అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా దొంగ చాటుగా తొవ్వుకొని లక్షలు ఆర్జిస్తున్నారు. ఏఎస్ పేట మండలం చౌట భీమవరం గ్రామంలో గత రెండు రోజులుగా ఉత్తరకాలు వ కు దక్షిణం వైపున ఉన్న ప్రభుత్వ భూముల్లో గుట్టు చప్పుడు కాకుండా జెసిబి లతో తెల్లరాయి తవ్వుతున్నారు. టన్నులకొలదిరాయి గుట్టలుగా పోసి ఉండడంతో గమనించిన గ్రామస్తులు కొందరు రెవెన్యూ పోలీస్ అధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన అధికారులు అక్రమంగా తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. అక్రమంగా తెల్ల రాయి తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img