Friday, April 26, 2024
Friday, April 26, 2024

ముస్లింలను మోసగించిన జగన్

పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం గత 68 రోజులుగా నిర్విరామంగా జరుగుతోంది. 68వ రోజున మూలాపేట సి.ఏ.ఎం స్కూల్ వద్ద, బాలూషా పేట ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి సమస్యల అధ్యయనం చేసారు. ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలు ఎక్కువగా నివసిస్తున్నారు. ముస్లిం సోదరులు పలువురు ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన సీఎం జగన్ రెడ్డి గారు ఇప్పుడు తమని ఎలా మోసం చేసారో కేతంరెడ్డికి వివరించారు.

ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ గారి గెలుపులో ముస్లిం మైనారిటీల పాత్ర కీలకం అన్నారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన జగన్ రెడ్డి గారు, అధికారం చేపట్టాక దుల్హన్ వంటి పథకాలను ఎత్తేశారని, మైనారిటీ కార్పొరేషన్ రుణాలను కూడా ఇవ్వకుండా నిధులను పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. ఉర్దూని రెండో అధికార భాష చేసారు కానీ ఇప్పటివరకు ముస్లిం యువతకు ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో ట్రాన్సలేటర్ పోస్టుల కసరత్తు జరగలేదన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు కనీసం పేద ముస్లిం పిల్లలకు ఎండా కాలంలో ప్రభుత్వం తరఫున జరిపే ఉచిత ఖత్నా (ఒడుగులు తీసే కార్యక్రమం) కూడా జరిపించలేకపోయారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని, ఆ దిశగా ముస్లిం సోదరులందరూ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తూ అల్లాకు దువా చేయాలని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ సమగ్ర అభివృద్ధి జరుపుతామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img