విశాలాంధ్ర (కలిగిరి): మండల కేంద్రమైన కలిగిరిలో తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శీనా నాయక్ సమక్షంలో కావలి-టూ – దుత్తలూరు నేషనల్ హైవే(NH167BG)కి సంబంధించిన భూసేకరణ విషయమై మండలము లోని కలిగిరి మరియు పోలంపాడు H/o పెద్ద కొండూరు పరిధిలోని రైతులు మరియు లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయము నందు అవార్డు ఎంక్వయిరీ నిర్వహించి, అధికారులకు సూచనలు చేయడం జరిగినది.తెలిపారు. అనంతరం వెలగపాడు మరియు అనంతపురం సచివాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డలను పరిశీ లించి సచివాలయం సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో తహసీల్దార్ టివియం. కృష్ణప్రసాద్,అధికారులు, రైతులు పాల్గున్నారు.