Friday, April 19, 2024
Friday, April 19, 2024

స్వతంత్ర సమరయోధుల త్యాగాలు మరువలేనివి

విశాలాంధ్ర – ఉదయగిరి : దేశానికి స్వతంత్రం సాధించడంలో స్వతంత్ర సమరయోధుల త్యాగాలు మరవలేనివని స్థానిక మండల అధ్యక్షురాలు మూలే పద్మజ అన్నారు శనివారం ఆరవ రోజు ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే మన దేశానికి స్వతంత్రం సిద్ధించిందని అన్నారు దేశ ప్రజల కోసం వారు చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు మొదటిగా స్వతంత్ర సమరయోధుల చిత్రపటాల గ్యాలరీని ఆమె ప్రారంభించారు కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మూలే వినయ్ కుమార్ రెడ్డి ఎంపీడీవో పి ఐజాక్ ప్రవీణ్ జడ్పీ కోర్స్ నెంబర్ షేక్ గాజుల తాజుద్దీన్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img