Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తూపిలి తీరంలో విషాదం

. లారీలో నుంచి జారిపడి ఇద్దరు మృతి
. ఇద్దరు పరిస్థితి విషమం

వాకాడు:(విశాలాంధ్ర)మండల పరిధిలోని తూపిలిపాలెంలో విషాదం చోటుచేసుకుంది వినాయక నిమజ్జననీకి వెళ్లి తిరుగు ప్రయాణం లో లారీలో నుండి జారిపడి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వివరాల్లోకి వెళ్తే ఓజిలి మండలం పొన్నేపల్లికి చెందిన కొంత మంది గ్రామస్తులు వినాయక నిమజ్జనం కోసం తుపిలిపాలెం సముద్ర తీరానికి వచ్చి నిమజ్జనం అనంతరం లారీలో తిరిగి స్వగ్రామం వెళ్తుండగా తూపిలిపాలెం బ్రిడ్జి నుండి 200 మీటర్ల దూరంలో లారీ అతి వేగం కారణంగా ఒక్క సారిగా 4గురు లారీ నుంచి జరి క్రింద పడిన సంఘటనలో ఇంటర్మీడియట్ చదువుతున్న శ్రీకర్ (17) మరొక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img