విశాలాంధ్ర, పార్వతీపురం: భారతదేశ ఉప ప్రధానిగా కీర్తిశేషులు బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు ప్రశంసనీయమని టిడిపి, జనసేన,బీజేపి ఉమ్మడిఎమ్మెల్యే అభ్యర్థి విజయచంద్ర తెలిపారు.శనివారం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలను, దళితులకు ఆయన చేసిన సేవలను ఆయనతో పాటు పలువురు నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు కొనియాడారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గంలోని మూడుమండలాలకు చెందిన టిడిపి బిజెపి జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.