Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

టీడీపీ వర్క్ షాప్ కు వెళ్ళిన మన్యంజిల్లా టీడీపిఅభ్యర్దులు, పరిశీలకులు

విశాలాంధ్ర,పార్వతీపురం: రెండురోజుల పాటు విజయవాడలో జరుగుతున్న టీడీపీ వర్క్ షాప్ కు మన్యంజిల్లా నుండి పార్వతీపురం,కురుపాం, సాలూరు టీడీపీ అభ్యర్థులు బోనెల విజయ్ చంద్ర, తోయక జగదీశ్వరి, గుమ్మడి సంధ్యారాణితోపాటు పాలకొండ నియోజక వర్గ ఇంచార్జి నిమ్మక జయకృష్ణలు, పార్టీపరిశీలకులు హాజరయ్యారు. శని,ఆదివారాల్లో విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్ధులకు దిశ-దశ చేస్తున్నట్లు తెలిపారు.50రోజులపాటు నిర్వహించాల్సిన ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల కమిషన్ జారీచేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహణ, పోల్ మేనేజ్మెంట్, ఎన్నికల ఖర్చు,అభ్యర్ధులకు పలు అంశాలపై అవగాహన, ప్రచారంగూర్చి, నామినేషన్ల గూర్చి, ఉమ్మడిపార్టీల నేతలతో సమన్వయం తదితర అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వివరించారు. మూడుపార్టీల నాయకులు కలిసి మెలిసి ఉంటూ పార్టీ గెలుపుకు పనిచేసే విధానాన్ని వివరించారు.మొదటి రోజు శనివారం జరిగిన వర్క్ షాప్ ద్వారా అన్ని అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపి నేతలు పూర్తిఅవగాహన కల్పించారని పార్వతీపురం టీడీపీ అభ్యర్థి విజయ్ చంద్ర చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img