Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరాలి

విశాలాంధ్ర సంతనూతలపాడు: స్వాతంత్ర దినోత్సవ అమృత మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 13 14 15 తేదీలలో గ్రామాలలోని ప్రతి ఇంటి పై పై జాతీయ జండాను ఎగరాలని ఈఓ ఆర్ డి జి రామకృష్ణ అన్నారు. స్థానిక సచివాలయం నందు సోమవారం సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు స్వాతంత్ర దినోత్సవ అమృత మహోత్సవాల విశిష్టత గురించి వివరించారు. జయప్రదం చేయడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు .దేశానికీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా గ్రామములో ర్యాలీలను విద్యార్థిని విద్యార్థులకు కాంపిటేటివ్ ప్రొగ్రామ్స్ నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దర్శి నాగమణి వై సి పీ యువ నాయకుడు దుంపా ఇంద్రసేనారెడ్డి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img