విశాలాంధ్ర సంతనూతలపాడు : మండలంలోని గుమ్మల్లం పాడు వీఆర్వో గా పనిచేస్తున్న ఎం శ్రీనివాసులు బదిలీపై చీమకుర్తి మండలం పులికొండ గ్రామానికి వెళ్ళటంతో బుధవారం స్థానిక గ్రామ సచివాలయ నందు సర్పంచ్ షేక్ పాశ్చా సాహెబ్ సొసైటీ అధ్యక్షులు బొక్కిసం శివరామయ్యల ఆధ్వర్యంలో వారికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో డి ఎస్ వి ప్రసాద్ ఆర్ ఐ సుష్మ ఏవో పి పావని గ్రామ కార్యదర్శి ఎన్ ప్రతాప్ కుమార్ వీఆర్వోలు సుబ్బమ్మ కుమార్ సుధాకర్ రావు రామాంజనేయులు. ఎం పీ టీ సీ నాగేశ్వరరావు. గ్రామ ఉపసర్పంచ్ ఎం దామోదరరావు సచివాలయ సిబ్బంది వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.