Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉలిచి చెక్ డాం లో పడి వ్యక్తి మృతి

మరో ఇద్దరిని కాపాడిన జాలర్లు

విశాలాంధ్ర నాగులుప్పలపాడు : ఉలిచి చెక్ డాం లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. అక్కడే ఉన్న జాలర్లు మరో ఇద్దరిని వలల సహాయంతో కాపాడారు. ఎస్ఐ రమణయ్య సంఘటనలకు చేరుకొని మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని కుక్కలవారి పాలెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పుట్ట వేంకట రెడ్డి, కావురి వెంకటేశ్వర్ రెడ్డి, కుక్కల అక్కిరెడ్డి, ఉలిచి చెక్ డాం దాటుతున్న క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం. చెక్ డాం కు ఎక్కువగా పాచి ఉండటం వల్ల కాలుజారి ముగ్గురు వ్యక్తులు గుండ్లకమ్మ దిగువ భాగాన్ని జారి పడిపోయారు అక్కడే ఉన్న జాలర్లు వారి ఉన్న వలల సహాయంతో ఇద్దరిని కాపాడారు. మరో వ్యక్తి గల్లంతయ్యారు. స్థానిక అధికారులు గల్లంతైన వ్యక్తి కోసం బోటు సహాయంతో గురువారం మధ్యాహ్నం వరకు వెతుకులాడారు మృతి దేహం నదిపైకి తేలాడటంతో గుర్తించి బోట్ సహాయంతో కుక్కల అక్కిరెడ్డి (25) మృదేహాన్ని బయటకు తీశారు. వైసిపి నాయకులు కృష్ణారెడ్డి, కంచర్ల సుధాకర్, పొలినేని కోటేశ్వరరావు, పలువురు నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి దేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ఎస్సై రమణయ్య పోస్టుమార్టం నిమిత్త మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img