Friday, April 19, 2024
Friday, April 19, 2024

పంచాయతీ కార్యానికి తాళాలు వేసిన ఘటనపై ఆర్ డి వో విచారణ

విశాలాంధ్ర మార్టూర్ పంచాయతీ కార్యాలయంలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలపై చీరాల ఆర్టీవో సరోజిని బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో విచారణ చేపట్టారు. పంచాయతీ కార్యాలయానికి సర్పంచ్ వంకాయలపాటి భాగ్య రావు తాళాలు వేశాడనిఆరోపణపై ఆమె సిబ్బందిని గ్రామస్తులను విడివిడిగా పిలిపించి విచారించారు. ఈ సమయంలో గ్రామంలో సర్పంచ్ భాగ్య రావు అందుబాటులో లేకపోవడం గమనార్హం విచారణకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆర్డీవో సరోజినీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ విఆర్ఓ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img