Friday, April 26, 2024
Friday, April 26, 2024

సింగిల్ విండో అధ్యక్షునిగా సంగు సుబ్బారెడ్డి

నియామక పత్రం అందించిన ఎమ్మెల్యే బుర్ర

విశాలాంధ్ర : కనిగిరి కనిగిరి సింగిల్ విండో అధ్యక్షునిగా వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షుడు సంగు సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్ భవన్ లో జిల్లా పార్టీ అధ్యక్షులు టీటీడీ పాలక మండలి సభ్యులు శాసన సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ సంగు వెంకట సుబ్బారెడ్డికి కనిగిరి సింగిల్ విండో అధ్యక్షులుగా ప్రభుత్వ నియమిక పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్ర మాట్లాడుతూ రైతులకు సహకార పరపతి సంఘాల ద్వారా అందవలసిన సంక్షేమ పథకాలు పారదర్శకంగా చూపాలన్నారు. ఈ సందర్భంగా సంగు సుబ్బారెడ్డి మాట్లాడుతూ సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎంపిక చేసిన పదవి శాసన సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ , మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు సూరసాని మోహన్ రెడ్డికి , వైసిపి నాయకులు సానికొమ్ము రంగనాయకుల రెడ్డికి కృతజ్ఞతలు తెలి పారు.ఈ కార్యక్రమంలో కనమర్ల బాల కృష్ణారెడ్డి,అంథోని,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img