Friday, May 3, 2024
Friday, May 3, 2024

వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి

విశాలాంధ్ర – కదిరి : వైకాపా పార్టీ కనుమరుగయ్యేoదుకు రోజులు దగ్గర పడ్డాయాని టీడీపీ నాయకులు తెలిపారు. శుక్రవారం కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లలో వాల్మీకి విగ్రహం వద్ద మహిళా శక్తి టీం హాజరైయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో భాగంగా ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15000 రూపాయలు చొప్పున అందచేస్తామని, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని, మహిళలకు జిల్లా వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం, ఇంకా మరెన్నో సంక్షేమ పథకాల ప్రవేశపెట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకురాలు పర్వీన్ భాను, ఆశాబి, నిర్మలమ్మ, సరోజమ్మ, దేవి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img