కోల్కతాపై ఘన విజయం
దుబాయి: ఐపీఎల్-14 విజేత చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. దుబాయి వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును 27 పరుగుల తేడాతో చెన్నై ఓడిరచింది. బ్యాట్స్మెన్ విఫలం కావడంతో చెన్నై చేతిలో ఘోర పరాజయాన్ని కేకేఆర్ మూటగట్టుకుంది. సీఎస్కే ఈ విజయంతో నాలుగోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు ఓపెనర్లు డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32) మంచి ఆరంభాన్ని అందించారు. గైక్వాడ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మరో బ్యాట్స్మన్ రాబిన్ ఉతప్ప (31) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఉతప్ప, గైక్వాడ్ ఔటైనా..డుప్లెసిస్ దూకుడుగా ఆడి వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత వచ్చిన మొయిన్ అలీ కూడా (37) వేగంగా పరుగులు చేశాడు. అప్పటికే చెన్నై భారీ స్కోర్ సాధించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ 192 రన్స్ చేసింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టు దూకుడుగా ఛేజింగ్ ఆరంభించింది. కేకేఆర్ ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభమన్ గిల్ (51) ధాటిగా ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. అయ్యర్, గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓపెనర్ వెంకటేశ్ అయ్యార్ భారీ షాట్కు ప్రయత్నించి జడ్డుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఇక్కడి నుంచి చెన్నై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేకేఆర్ ఆటగాళ్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. కోల్కతా బ్యాటింగ్లో కార్తిక్ (9), షకీబ్ (0), రాహుల్ త్రిపాఠి (2), మోర్గాన్ (4) ఘోరంగా విఫలం కావడంతో కేకేఆర్ ఓటమి చవిచూసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేరికి కోల్కతా జట్టు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీఎస్కే బౌలింగ్లో ఠాకూర్ 3, హేజిల్వుడ్ 2, జడేజా 2, చాహర్, బ్రావో చెరో వికెట్ తీశారు. దీంతో సీజన్-14 ఐపీఎల్ ఛాంపియన్గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.