టోక్యో వేదికగా ఒలింపిక్స్ ఈ ఏడాది జులై 23 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే.? కరోనా కారణంగా ఇప్పటికే చాలా నిబంధనలను మార్చిన అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం.. తాజాగా మరో నిబంధనను మార్చేసింది. విజేతలైన వారికి పతకాలను అతిథులు మెడలో వేస్తారు.అయితే ఈ ఏడాది ఎవరి మెడల్ వారే వేసుకోవాలని కొత్త రూల్ను తీసుకొచ్చింది. కొవిడ్ కారణంగా ఇలాంటి నిబంధనను తీసుకొచ్చినట్లు నిర్వాహక కమిటీ పేర్కొంది.
కరోనాతో ఓవైపు టోక్యోలో కేసులు విసరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 1,149 మంది పాజిటివ్గా తేలినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలల్లో అక్కడ ఈ రేంజ్లో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారంట. ఒలింపిక్ క్రీడలకు మరో 9 రోజులే ఉండడంతో.. కోవిడ్ కేసులు మరింత పెరుగుతుండడంతో.. జపాన్ ప్రభుత్వం, ఐఓసీ, గేమ్స్ నిర్వాహక కమిటీలు ఆందోళనలో పడ్డాయి. ప్రస్తుతానికి అక్కడ ఎమర్జెన్సీ విధించినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే.