Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కెప్టెన్‌గా పంత్‌ కొనసాగుతాడు…

దిల్లీ : యూఏఈలో జరిగే ఐపీఎల్‌ రెండో దశలోనూ రిషబ్‌ పంత్‌ సారథిగా కొనసా గుతాడని దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు యాజ మాన్యం అధికారికంగా స్పష్టం చేసింది. స్పష్టం చేసింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యం గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో పంత్‌ను సారథిగా నియమిస్తూ అప్పుడు ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా.. వాయిదా పడగా, ఇప్పుడు రెండో దశకు శ్రేయస్‌ కోలుకుని జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయంపై చర్చ సాగింది. ఈ క్రమంలోనే పంత్‌ కెప్టెన్సీ కొనసాగిస్తాడని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img