దిల్లీ : స్థానిక త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సెప్టెంబర్ 24 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ సచివా లయ అధికారులు సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ వెటరన్ విభాగంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ సెక్షన్ ఆఫీసర్లు ఎం.బేబీ సరోజిని, సహదేవ సత్యవతి.. మధ్య ప్రదేశ్ జంటపై 3-0 స్కోరుతో గెలిచి బంగారు పతకం అందు కున్నారు. 2018లో హరియాణా పంచకుల్లో, 2020లో పూణేలో నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ల్లో కూడా వీరు బంగారు, వెండి పతకాలు సాధించారు. 2018లో ఎం.బేబీ సరోజిని వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నారు. ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం తరఫున టేబుల్ టెన్నిస్ పోటీలలో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన ఘనత వీరికి దక్కింది. వెలగపూడి సచివాలయం జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కూడా క్రీడల మీద ఉన్న ఆసక్తితో ఎటువంటి శిక్షణ లేకుండా స్వశక్తితో వీరు పతకాలు సాధించడం విశేషం.