న్యూదిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండు స్వర్ణాలు లభించాయి. బాక్సింగ్ 81 కిలోల విభాగంలో హరియాణాకు చెందిన స్వీటీ బూరా బంగారు పతకాన్ని అందుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ లినాపై 4-3 తేడాతో విజయం సాధించి పసిడిని ముద్దాడిరది. 2014లో ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న 30 ఏళ్ల స్వీటీ… ఈ సారి పట్టుదలతో పసిడిని ఒడిసి పట్టింది. అంతకుముందు సెమీస్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్వా నుంచి కఠిన సవాల్ ఎదుర్కొన్న స్వీటీ.. తాజాగా 4-3 తేడాతో విజయం సాధించింది. 48 కిలోల విభాగంలో నీతూ గాంగాస్ను పసిడి వరించింది. నీతూ ఫైనల్లో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్పై 5-0 తేడాతో విజయం సాధించింది. భారత్కు చెందిన మేరీకోమ్ (ఆరుసార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, నిఖత్ జరీన్ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించగా.. ఇప్పుడు ఆ జాబితాలో నీతూ, స్వీటీ కూడా చేరారు.