Friday, April 26, 2024
Friday, April 26, 2024

సిరాజ్‌ మెరుపులు

పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయం

మొహాలీ : ఐపీఎల్‌ 2023లో భాగంగా గురువారంనాడిక్కడ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌`ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర వహిం చాడు. టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకోగా మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ… నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ మొదలెట్టిన పంజాబ్‌ కింగ్స్‌, 18.2 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌట్‌ అవడంతో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఏడాదిన్నర తర్వాత కెప్టెన్సీ చేసిన విరాట్‌ కోహ్లీ, విజయంతో రీఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్‌ కింగ్స్‌కి శుభారంభం దక్కలేదు. మొదటి బంతికి ఫోర్‌ బాదిన అథర్వ టైడె… రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. ఓ సిక్సర్‌ బాది 8 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్‌, వానిందు హసరంగ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 2 పరుగులు చేసిన లియామ్‌ లివింగ్‌స్టోన్‌ కూడా సిరాజ్‌ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్‌ తీసుకున్న ఆర్‌సీబీకి వికెట్‌ దక్కింది. 9 బంతుల్లో ఓ ఫోర్‌, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన హర్‌ప్రీత్‌ సింగ్‌ భాటియా… సిరాజ్‌ నేరుగా విసిరిన త్రోకి రనౌట్‌ అయ్యాడు. కెప్టెన్‌ సామ్‌ కరన్‌ కూడా 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరో వైపు బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును కదిలించిన ఓపెనర్‌ ప్రభుసిమ్రాన్‌ సింగ్‌… 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి పార్నెల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. 97 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చి ఓ సిక్సర్‌ బాదిన షారుక్‌ ఖాన్‌ కూడా హసరంగ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు. ఈ తరుణంలో హర్‌ప్రీత్‌ బ్రార్‌, జితేశ్‌ శర్మ కలిసి 8వ వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం జోడిరచారు. కాగా 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన హర్‌ప్రీత్‌ బ్రార్‌ని క్లీన్‌ బౌల్డ్‌ చేసిన మహ్మద్‌ సిరాజ్‌, అదే ఓవర్‌లో నాథన్‌ ఎల్లీస్‌ని కూడా బౌల్డ్‌ చేశాడు. దీంతో 18 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయింది
4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మహ్మద్‌ సిరాజ్‌, ఐపీఎల్‌లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేసిన జితేశ్‌ శర్మ, ఆఖరి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెజర్స్‌ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగుల స్కోరు చేయ గలిగింది. ఒక దశలో 137/0 స్కోరుతో కనిపించిన ఆర్‌సీబీ, సులభంగా 200 పరుగులకు పైగా స్కోరు చేస్తుందని అభిమానులు ఆశించారు. అయితే చివరి ఓవర్లలో వరుస వికెట్లు తీసిన పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లు, ఆర్‌సీబీ స్కోరును కట్టడి చేశారు. ఫాఫ్‌ డుప్లిసిస్‌, విరాట్‌ కోహ్లీ కలిసి తొలి వికెట్‌కి 137 పరుగుల భాగస్వామ్యం జోడిరచారు. 40 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న విరాట్‌ కోహ్లీ, హర్‌ప్రీత్‌ బ్రార్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ పట్టిన సూపర్బ్‌ క్యాచ్‌కి అవుట్‌ అయ్యాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీ… ఐపీఎల్‌ 2023 సీజన్‌లో నాలుగో హాఫ్‌ సెంచరీ బాది పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాతి బంతికి వస్తూనే భారీ షాట్‌ ఆడేం దుకు చూసిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, అథర్వ టైడెకి క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. వరుసగా రెండు వికెట్లు పడిన తర్వాత వేగం పెంచిన ఫాఫ్‌ డుప్లిసిస్‌, రెండు సిక్సర్లు బాదాడు. 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 పరుగులు చేసిన ఫాఫ్‌ డుప్లిసిస్‌… నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో సామ్‌ కరన్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. 137/0 స్కోరుతో ఉన్న ఆర్సీబీ కేవలం 8 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి 151/3 స్థితికి చేరుకుంది. దినేశ్‌ కార్తీక్‌ కూడా ఎప్పటి లాగే 5 బంతుల్లో ఓ ఫోర్‌ బాది 7 పరుగులు చేసి అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. మహిపాల్‌ లోమ్రోర్‌ 9 బంతుల్లో 7, షాబజ్‌ అహ్మద్‌ 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. సిరాజ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img