న్యూదిల్లీ: దిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఆ టోర్నీలో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఐపీఎల్లో 600 ఫోర్లు కొట్టిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో వార్నర్ 51 పరుగులు చేశాడు. దాంట్లో ఆరు బౌండరీలు ఉన్నాయి. అయితే ఐపీఎల్లో 600 ఫోర్ల మార్క్ను చేరుకున్నారు. మొదటి స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నాడు. 209 మ్యాచ్లు ఆడిన ధావన్.. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధికంగా 728 ఫోర్లు కొట్టాడు. ఇక మూడవ స్థానంలో ఉన్న కోహ్లీ ఖాతాలో 591 ఫోర్లు ఉన్నాయి. అయిదో స్థానంలో రోహిత్ శర్మ(528), ఆరో స్థానంలో సురేశ్ రైనా(506) ఉన్నారు.