Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీస్‌లో ప్రణయ్‌, ప్రియాన్షు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లు సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించారు. ప్రపంచ నం.9 ర్యాంకర్‌ ప్రణయ్‌… ఈ ఏడాది మూడవ సారి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఈవెంట్‌లో సెమీస్‌లోకి వెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఇండో నేశియా ఆలగాడు ఆంథోనీ గిన్‌టింగ్‌పై 16-21, 21-17, 21-14 స్కోర్‌తో ప్రణయ్‌ విజయం సాధించాడు. సెమీ స్‌లో ప్రపంచ నం.31 ర్యాంకర్‌ భారత్‌కే చెందిన ప్రియాన్షు రజావత్‌తో ప్రణయ్‌ తలపడనున్నాడు. కాగా వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 ఈవెంట్‌లో తొలిసారి ప్రియాన్షు సెమీస్‌లోకి ప్రవేశించాడు. కిదాంబి శ్రీకాంత్‌పై 21-13, 21-8 స్కోరుతో అతను గెలుపొందాడు. ఇక శుక్రవారం ఉదయం జరిగిన మహిళల క్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి చవిచూసింది. చైనీస్‌ థైపీ క్రీడాకారిణి జాంగ్‌ 21-12, 21-17 స్కోరుతో సింధుపై విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img