Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాలు.. ప్రిన్సిపాల్.. ఎస్. పద్మశ్రీ.

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(2024-25 సంవత్సరపు) ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. పద్మశ్రీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటర్ కు దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపారు. (https://apms.apcfss.in) ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 150 రూపాయలు ఫీజు, ఓసి బిసి విద్యార్థులకు 200 రూపాయల ఫీజు చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్ విధానం ఈనెల 28 నుండి మే 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఉచిత విద్యతోపాటు కళాశాలలో బోధన మాధ్యమం ఆంగ్లంలో ఉంటుందన్నారు. విద్యను అభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవని తెలిపారు. విద్యార్థులు జిల్లాలో ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో పదవ తరగతి ఉత్తీర్ణులైన వారికి మాత్రమే అర్హులని తెలిపారు. ఇంటర్ ప్రవేశాలు 10వ తరగతి మార్కుల మెరిట్ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు గమనించి, తమ పిల్లలను మోడల్ కళాశాలలో ప్రవేశాలకు మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 7981171568కు గాని 6305974274 కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img