Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

గెలుపే లక్ష్యం-ఫలితాలే మా నినాదం.. శ్రీ విజ్ఞాన్ స్టడీ సర్కిల్.. జే. రమేష్

విశాలాంధ్ర ధర్మవరం:: గెలుపే లక్ష్యము అని, ఫలితాలే మా నినాదం అని శ్రీ విజ్ఞాన్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు జే. రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా స్టడీ సర్కిల్లో పాలిటెక్నిక్ (సీప్), ఏపీఆర్జేసీ, ఆర్ డి టి, అగ్రి పాలీసెట్ లాంటి కోచింగులు ఇస్తూ అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. గతంలో ఏపీఆర్జేసీ నందు రాష్ట్ర 10, 21, 29, 34, 36, 42 ర్యాంకులను సాధించడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోచింగు ను కే పి టి వీధిలోని శ్రీ వాసవి జూనియర్ కళాశాలలో ఉదయం 11 నుండి సాయంత్రం నాలుగు వరకు ఈనెల 29వ తేదీ నుండి నిర్వహిస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే షార్ట్ కం మెథడ్స్ తో కూడిన బోధన ఉంటుందని ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉంటాయని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామని తెలిపారు. ప్రణాళికా బద్ధమైన చక్కటి స్టడీ మెటీరియల్ సో ముందుకు వెళుతున్నామని తెలిపారు. గత 11 సంవత్సరాలుగా పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ, ఆర్డిటి సెట్ ఫలితాలలో జిల్లాలోనే అత్యధిక సీట్లు సాధించి అందరి మన్ననలు పొందడం జరుగుతుందని తెలిపారు. కావున ఇటువంటి అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img