విశాలాంధ్ర ధర్మవరం:: భగవద్గీత పోటీ పరీక్షలు అనంతపురం ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ధర్మవరం ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ది గీత కాంటెస్ట్ (భగవద్గీత పోటీ పరీక్షలు) అతి త్వరలో ప్రవేశపెడుతున్నామని, 8 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు అన్ని వయసులో ఉన్నవారు పాల్గొనవచ్చునని తెలిపారు. 10 లక్షలు విలువ చేసే బహుమతులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఆసక్తి గలవారు ప్రవేశ రుసుమును 350 రూపాయలు ఉంటుందని భగవద్గీత యధాతతం, చూచి వ్రాత పుస్తకం ఉచితమని తెలిపారు. ఉమ్మడి జిల్లా మొదటి కేటగిరి 8 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వారు మొదటి బహుమతికి ఒక లక్ష రూపాయలు, రెండవ బహుమతి 50వేల రూపాయలు, మూడవ బహుమతి 25వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరములు కేటగిరి వారికి కూడా ఇదే నగదు బహుమతులు, తదుపరి 25 సంవత్సరాల నుండి 70 సంవత్సరముల వారికి కూడా ఇదే నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు. ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులకు మండల వారీగా ప్రోత్సాక బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా భగవద్గీత భగవద్గీత వర్క్ షీట్ పుస్తకాలు కూడా మా వద్ద లభిస్తాయని తెలిపారు. పోటీ పరీక్షల తేదీలు త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. కావున ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.