Friday, May 3, 2024
Friday, May 3, 2024

విజయ దుందుభి మోగించిన బిఎస్సార్ పురపాలక బాలికలఉన్నత పాఠశాల

హెడ్మాస్టర్ ఉమాపతి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంజయ్ నగర్లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయ దుందుభి మ్రోగించడం జరిగిందని హెడ్మాస్టర్ ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం మా పాఠశాలలో 212మంది పరీక్షలు రాయగా అందులో 175 మంది ఉత్తీర్ణులు కావడంతో 93.39 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. ఇందులో కే. హరిణి 590/600 మార్కులు, ఎస్. మధురిమ 590 మార్కులు, డి. స్పందన 587మార్కులు, కే. కుందన586 మార్కులతో ప్రతిభ ఘనపరచడం జరిగిందన్నారు. తదుపరి హెడ్మాస్టర్ తో కలిపి ఉపాధ్యాయ, బోధనేతర బృందం విద్యార్థులు కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు, బోధ నేతర సిబ్బంది అభినందన శుభాకాంక్షలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img