Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో బిఎస్సార్ పురపాలక బాలుర ఉన్నత పాఠశాల విజయ దుందుభి

హెడ్మాస్టర్ రాంప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంజయ్ నగర్లో గల బిఎస్సార్ పురపాలక బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయ దుందుభి మ్రోగించడం జరిగిందని హెడ్మాస్టర్ రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం మా పాఠశాలలో 223 మంది పరీక్షలు రాయగా అందులో 189 మంది ఉత్తీర్ణులు కావడంతో 85 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. ఇందులో జి.సాగర్ అనే విద్యార్థి 593/600 మార్కులు, దుర్గ సాయి చరణ్ 591 మార్కులు, సి. తులసి కార్తీక్ 589 మార్కులు తో ప్రతిభ ఘనపరచడం జరిగిందన్నారు. 500 మార్కులు పైగా 64 మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. తదుపరి హెడ్మాస్టర్ తో కలిపి ఉపాధ్యాయ బోధనేతర బృందం విద్యార్థులు కలిసి టపాసులను పేర్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు, బోధ నేతర సిబ్బంది అభినందన శుభాకాంక్షలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img