Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విజయదుందుభి మోగించిన యశోద పాఠశాల విద్యార్థులు

విశాలాంధ్ర ధర్మవరం::2023-24 సంవత్సరపు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో స్థానిక యశోద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో తల్లిదండ్రులను, విద్యార్థులను ఆహ్వానించి విజయోత్సవ సభను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 129 మందిలో 580 మార్కులకు పైగా 9మంది 540కు పైగా 51 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులను సాధించడం జరిగిందని తెలిపారు. మా పాఠశాలలో మొత్తం 129 మంది పరీక్షలు రాయగా అందులో 128 మంది ఉత్తీర్ణులు కావడం జరిగిందని, 99.22 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. అనంతరం ప్రతిబ గణపరిచిన విద్యార్థినీ విద్యార్థులు అందరినీ కూడా పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున, డైరెక్టర్ ,ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయ బృందం, బోధనేతర బృందం అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img