విశాలాంధ్ర- ధర్మవరం : శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ ప్రకటించిన 6వ సెమిస్టర్ ఫలితాల నందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచినారని కళాశాల చైర్మన్ చిన్నపరెడ్డి, కళాశాల డైరెక్టర్ భాస్కర్ రెడ్డి,ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఎస్సీ నందు 87 మంది విద్యార్థులకు గాను 79 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ ఫలితాలలో 90 శాతము పైగా మార్కులను సాధించారని, బీకాం నందు కే.. వసుంధర 85 శాతము,జి సౌమ్య 82 శాతము, పి. చంద్రకళ 81 శాతము,జి.గౌతమి 80 శాతము, సి. భార్గవ 79 శాతము,మహమ్మద్ సాదిక్ 79 శాతము,సుకన్య 79 శాతము,యం. హారిక 79 శాతము మార్కులను సాధించారని తెలిపారు. కళాశాల పాస్ పర్సంటేజ్ 86 శాతముగా కలదని తెలిపారు. ఇంతటి విజయాన్ని అందించిన విద్యార్థులకు,అధ్యాపకులకు, వారి తల్లిదండ్రులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ హర్ష వర్ధన్, ఏఓ.. రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు