Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎన్ సి ఎస్ లో ఆకాశ దీపం(కార్తీకదీపం)

విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని లచ్చయ్యపేట ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార ప్రాంగణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం నెల రోజుల పాటు ఆకాశ దీపం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు డివి శ్రీనివాసా చార్యులు, వి పవన్ కుమార్, సాయిగణేష్ లు తెలిపారు. సోమవారం కార్తీక మాసంలో అత్యంత విశిష్టత కలిగిన కార్తీకపౌర్ణమి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఆకాశ దీపంను వెలిగించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో సోమవారం కార్తీక పౌర్ణమి కావడంతో అన్ని ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడాయి.సాయంత్రం అన్ని గ్రామాల్లో వారి ఇలవేల్పు దేవుడుకి పూజలు నిర్వహించారు. రోజంతా ఉపవాసం ఉండి నోములు చెల్లించి పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img