Friday, April 19, 2024
Friday, April 19, 2024

అంగన్వాడీకేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన అధికారులు

విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని పనుకుపేట, గాదెలవలస గ్రామ పంచాయతీల్లోని పలు అంగన్వాడీ కేంద్రాలను, పాటశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపిడిఓ కృష్ణ మహేశ్ రెడ్డి, ఈఓపిఆర్డీ వర్మలు మంగళ వారం ఆకస్మికంగా తనిఖీచేశారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందజేస్తున్న ఫౌష్టికాహారం గూర్చి, పిల్లలకు బోధన తదితర అంశాలపై ఆరాతీసారు. పాటశాలలో మధ్యాహ్న భోజనంను రుచి చూసి విద్యార్థులకు భోజనం గూర్చి అడిగి తెలుసుకున్నారు.అనంతరం సచివాలయంలను సందర్శన చేసి వారితో మాట్లాడి సిబ్బందిని పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో ఆయాపాటశాలల ఉపాధ్యాయ సిబ్బంది, పంచాయతీల సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img