Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్దిగా బైపల్లి పరమేశ్వరరావు

జై భారత్ పార్టి టికెట్టు ఖరారు చేసిన జె డి

విశాలాంధ్ర సంతబొమ్మాళి( శ్రీకాకుళం) : టెక్కలి నియోజకవర్గం జై భారత్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బైపల్లి పరమేశ్వరరావును ఆ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ ఖరారు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్తగా నియామక పత్రాన్ని ఇటీవల అందజేస్తారు. బీటెక్ ఇంజనీరింగ్ చేసిన బైపల్లి పరమేశ్వరరావు గతంలో పలు రంగాల్లో సంక్షేమ కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో పలు పత్రికల్లో ఆయన చేసిన సేవలకు ప్రశంసలు పొందారు. ఈ మేరకు గుర్తించిన జాతీయ పార్టీ అయిన జై భారత్ పార్టీ అధినేత జెడి లక్ష్మీనారాయణ ఆయన సేవలను గుర్తించి టెక్కలి నియోజకవర్గం కి ఎమ్మెల్యే టికెట్ను ఖరారు చేసినట్లు తెలిపారు. గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి పరమేశ్వరరావు ప్రపంచంలో చరిత్రగా నిలిచిన, భారతదేశ నికే గర్వకారణమైన, భారత దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్టుదల, దీక్ష గా మారిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి తన వంతుగా లక్ష రూపాయలు విరాళాలని అందజేశారు. అలాగే భారతదేశం రక్షక దళానికి సైనిక దళానికి తన వంతుగా విరాళాల సేకరణ విభాగానికి అందజేశారు. అలాగే తితిలి తుఫాన్, హుదుద్ తుఫాన్ సమయాల్లో అభాగ్యులను ఆదుకునేందుకు తనవంతుగా విరాళాల సేకరణ సంస్థకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో నిరు పేద కుటుంబానికి చెందిన పసిపాప ప్రమాదానికి గురి కావడంతో, తనవంతుగా ఆపద్భాందవుడు గా, ప్రాణ దాతగా అండగా నిలిచి ఆర్థిక సహాయం చేసి, ఆసుపత్రి తీసుకువెళ్లి చికిత్స చేయించి, ప్రాణాలు రక్షించారు. అటువంటి సేవా తత్పరుడైన పరమేశ్వరరావు కు టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ లభించడంతో సర్వత్ర హర్షాతిరేకాలు వెల్లివిరిస్తున్నాయి. బీటెక్ ఇంజనీరింగ్ చేసిన పరమేశ్వరరావు మత్స్యకారుల వర్గానికి చందడంతో జిల్లాలో కల మత్యకార నాయకులతో పాటు, సంతబొమ్మాళి మండలంలో కల నాయకులు, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img