Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

స్పందనా పిర్యాదులు త్వరితగతిన పరిష్కారం చేయాలి

జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర – పార్వతీపురం:స్పందన కార్యక్రమంద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత పోలిస్ స్టేషన్ సిబ్బంది త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు.సోమవారం స్పందన కార్యక్రమంను ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజలసమస్యల వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.
ఈస్పందన కార్యక్రమంలో ఆయనతో పాటు అడిషనల్ ఎస్పీ డాక్టరు దిలీప్ కిరణ్ ఎస్బి, సిఐ, శ్రీనివాసరావు, డిసిఆర్ బి, సిఐ. ప్రభాకర్, ఎస్ఐ.దినకర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img