Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉపాధిహామీపథకం లక్ష్యాలను నెరవేర్చడానికి సిబ్బంది కష్టపడి పనిచేయాలి

పిడి రామచంద్రరావు

విశాలాంధ్ర,సీతానగరం: ఉపాధి హామీ పథకం లక్ష్యాలను నెరవేర్చడానికి సిబ్బంది కష్టపడి పనిచేసి ఫలితాలను సాధించాలని మన్యం జిల్లా ఉపాధి హామీ పథకం పథక సంచాలకులు కె. రామచంద్రరావు పిలుపు నిచ్చారు.బుదవారం స్తానిక మండల పరిషత్తు కార్యాలయంలో సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం,మక్కువ, సాలూరు, పాచిపెంట, గరుగుబిల్లి మండలాల ఏపిఓలు, ఇంజినీరింగ్ సిబ్బంది, సాంకేతిక సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అన్ని అంశాలపై చర్చించారు. గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలు, బిల్లుల చెల్లింపులో జాప్యం, ఉపాధిహామీపథకంద్వారా చేస్తున్న, చేయనున్న పనులు, ప్లాంటేషన్ తదితర అంశాలపై చర్చించారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం, సీతమ్మపేట, సాలూరు సహాయ పధక సంచాలకులు చంద్రమ్మ, శ్రీహరిరావు, కృష్ణారావులు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img