Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎంపిడిఓగా కృష్ణ మహేష్ రెడ్డి భాధ్యతలు స్వీకారం

విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక మండల పరిషత్తు నూతన ఎంపిడిఓగా బి.కృష్ణ మహేష్ రెడ్డి మంగళవారం ఉదయం పదవీ భాధ్యతలు చేపట్టారు. ఆయన నేరుగా గ్రూప్ 1సర్వీసు ద్వారా ఎంపికకావడంతో ఈజిల్లాకు పోస్టింగ్ కేటాయించారు. కడపజిల్లాకు చెందిన రెడ్డికి జిల్లా పరిషత్సి ఈఓ సీతానగరం మండలంను కేటాయించారు. సోమవారము జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఉత్తర్వులు తీసుకొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను సోమవారం మర్యాద పూర్వకంగా  కలిసారు. మంగళవారం నాడు ఇంతవరకు ఎంపిడిఓగా పనిచేసిన ప్రసాద్ నుండి భాద్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపిపి బలగ రవనమ్మని మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్తగా వచ్చిన ఎంపిడిఒ రెడ్డిని మండల పరిషత్ సిబ్బంది, మండలఅధికారులు, పంచాయతి సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, పలువురు ప్రజా ప్రజా ప్రతినిధులు,తదితరులు కలసి పరిచయం చేసుకున్నారు. ఈసందర్భగా అయన మాట్లాడుతూ అందరి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందేలా తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు.అనంతరం సచివాలయ ఇంజినీరింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సత్వరం పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. సచియాలయ భవనాలు, వెల్ నెస్ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు త్వరిత గతిన నిర్మాణం పూర్తయ్యలే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో పరిపాలన అధికారి ప్రసాద్, ఈఓపిఆర్డి వర్మ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img