విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని జోగింపేట సచివాలయాన్ని, ఇప్పలవలస గ్రామ పంచాయతీ చెత్త సంపద కేంద్రాన్ని ఈఓపిఆర్డి వర్మ మంగళ వారం సందర్శన చేసారు. సచివాలయం సిబ్బంది హాజరు పరిశీలించి పలు సూచనలు చేశారు.ఇప్పలవలస షెడ్ నిర్మాణం పూర్తయి నందున తక్షణమే వినియోగంలోకి తీసుకుని రావాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావుకు సూచించారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, క్లాప్ మిత్రలకు జీతభత్యాలు 15వ ఆర్థిక సంఘం నిధులనుండి ఇవ్వవలసినదిగా కోరారు. ఈకార్యక్రమంలో జోగమ్మపేట సెక్రటరీ కిరణ్,పాపమ్మవలస కార్యదర్శి పైడిరాజు సచివాలయంసిబ్బంది, క్లాప్ మిత్రలు పాల్గొన్నారు.