Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించండి

విశాలాంధ్ర,పార్వతీపురం: ఉత్తరాంధ్ర పట్టభద్రులఅభ్యర్థిగా తెలుగుదేశంపార్టీ తరుపున పోటీచేస్తున్న డాక్టరు వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని పార్వతీపురం నియోజకవర్గం పరిశీలకులు గోవిందరాజులు, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్, టీడీపి నియోజక వర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కోరారు.బుదవారం వారంతా పట్టణంలోని విద్యాసంస్థలలోను, ప్రధానకూడళ్ళులోను, వివిధసంస్థలలో,కార్యాలయాల్లో, వార్డులలోను ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. విద్యావంతుడు చిరంజీవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు.ప్రతీ ఒక్కరూ ఆలోచన చేసి ఓటును వేయాలని కోరారు.ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డి.శ్రీదేవి పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గుంట్రెడ్డి రవికుమార్, ప్రధాన కార్యదర్శి సిరిపురపు భాష్కరరావు, మండలపార్టీ అధ్యక్షులు దొగ్గ మోహన్,కోలా మధుసూదనరావు సీనియర్ తెలుగుదేశం నాయకులు గర్భాపు ఉదయభాను,బంకపల్లి రవికుమార్, సంబంగి తిరపతిరావు, శంకరరావు, కెంగువ ప్రదీపకుమార్ శివ, పోలా సత్యనారాయణ, చింతాడ వైకుంఠ రావు,చంద్రపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img