Friday, April 26, 2024
Friday, April 26, 2024

గ్రీవెన్స్ సమస్యలు పరిష్కారము చేయాలి

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

విశాలాంధ్ర,పార్వతీపురం: చట్ట పరిధిలో తగు చర్యలు తీసుకొని గ్రీవెన్స్ సమస్యలు పరిష్కారము చేయాలని పార్వతీపురం  మన్యంజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు.సోమవారం ఆయన కార్యాలయంలో “స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, వాటిని పరిష్కరించేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు
న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను  ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో 12 ఫిర్యాదులను స్వీకరించి, వాటిపరిష్కారానికి చర్యలు చేపట్టారు.స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణచేపట్టి 7 రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను, వెంటనే తనకు నివేదించాలని అధికారులను జిల్లాఎస్పీ  ఆధికారులను ఆదేశించారు.
ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ ఓ.దిలీప్ కిరణ్, ఎస్బీ సిఐ ఎన్.శ్రీనివాసరావు, డిసిఆర్బి ఎస్ఐ దినకర్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img