Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ముమ్మరంగా డ్రోన్లతో రీసర్వే : తహశీల్దార్ ఎన్వీ రమణ

విశాలాంధ్ర, సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలములోని పలు గ్రామాల్లో రీసర్వే ముమ్మరంగా జరుగుతుందని తహశీల్దార్ ఎన్వీ రమణ తెలిపారు.జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఆదేశాలు మేరకు మండలంలోని 25గ్రామాల్లో పూర్తి చేసినట్లు తెలిపారు.బుదవారం కోట సీతారామపురం,గుచ్చిమి గ్రామంలో డ్రోన్లతో రీసర్వే నిర్వహించారు.జిల్లా అధికారుల ఆదేశాలుమేరకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకంక్రింద ఎంపిక చేసిన మొదటి, రెండవ దశ గ్రామాల్లో రీసర్వే ముమ్మరంగా జరుగుతున్నదని తహశీల్దార్ ఎన్వీ రమణ తెలిపారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందికి సూచనలు ఇస్తూ వేగవంతంగా పూర్తిచేయాలని కోరుతున్నట్లు చెప్పారు. పలు గ్రామాల్లో రీసర్వేపనులు జరుగుతున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆయాగ్రామాలలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామసర్వేయర్లుతో పాటు విఆర్ఏలు ఆయాగ్రామాలలో ఉండి త్వరితగతిన పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయనతోపాటు డిప్యూటీ తహశీల్దార్ షేక్ ఇబ్రహీం,మండల రెవెన్యూ పర్యవేక్షకుడు రాజేష్, సర్పంచులు,,ఎంపిటిసిలు విఆర్ఓ లు,సర్వేయర్లు,రైతులు,పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img