Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కిషోర్ బాలికలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి: హెచ్ ఎం ప్రసన్నలక్ష్మి

విశాలాంధ్ర, సీతానగరం: కిషోర్ బాలికలు పౌష్టికాహారాన్ని సక్రమంగా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఉన్నత పాఠశాల హెచ్ ఎం ఇళ్లా ప్రసన్న లక్ష్మి తెలిపారు.గురువారం స్థానిక ఉన్నత పాఠశాలలో అంగన్వాడి సిబ్బంది ఆద్వర్యంలో కిషోర్ బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మాట్లడుతూ పోషక విలువలు కలిగిన పదార్థాలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సూపర్వైజరు అరుణ కుమారి, మహిళా పోలీసు గౌతమి, ఏఎన్ ఎం సంధ్య, అంగన్వాడీ కార్యకర్తలు సీతా మహాలక్ష్మి,రమాదేవి,సుజాత, సుగుణ, శ్రీదేవి,పార్వతి, విద్యార్థినిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img