విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని అంటిపేట గ్రామంలో 61లక్షల రూపాయలతో ఏర్పాటుచేయనున్న ఇంటింటికీ కుళాయిల పనులకు శంకుస్ధాపన,చెల్లంనాయుడువలస గ్రామ పంచాయితీలో స్వజల్ గ్రాంటు, జలజీవన్ మిషన్ ద్వారా 65లక్షలరూపాయలతో నిర్మించిన ఇంటింటికీ కుళాయిలను ఎమ్మెల్యే అలజింగి జోగారావు గురువారం ప్రారంబించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రైతుల దాన్యాన్ని దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపిడిఓ కృష్ణ మహేశ్ రెడ్డి, ఈఓపిఆర్దీ వర్మ, ఆర్ డబ్ల్యు ఎస్ జేఈ పవన్ కుమార్ తోపాటు మండల, గ్రామప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీనేతలు ,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
![](https://visalaandhra.com/wp-content/uploads/2022/11/image-21-1024x461.png)
![](https://visalaandhra.com/wp-content/uploads/2022/11/image-22-562x1024.png)